పీసీసీ చీఫ్ రచ్చ.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు

పీసీసీ చీఫ్ రచ్చ.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు

కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ పంచాయితీ ఎటూ తేలడం లేదు. రెండుమూడ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. ఎవరికీ వారు లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో పీసీసీ చీఫ్ ఎంపిక ఫైనల్ అయిందని.. ఏఐసీసీ నుంచి ప్రకటన కూడా వస్తుందన్న హడావుడి జరిగింది. కానీ పీసీసీ చీఫ్ ఎంపికపై అధిష్టానం మరింత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆశావాహులు మాత్రం హస్తినలోనే ఉండి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పనిలో పనిగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, మధుయాష్కీ పేర్లు పీసీసీ రేసులో ప్రముఖంగా వినిస్తున్నాయి.