అవినీతి ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే: షర్మిల

అవినీతి ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే: షర్మిల


హైదరాబాద్: ఎవరు అవినీతి చేసినా వారికి శిక్ష పడాల్సిందేనని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈటల అవినీతి పై విచారణను స్వాగతిస్తున్నానని ఆమె ట్విట్టర్లో ప్రకటించారు. అయ్యా కేసీఆర్ దొరగారు .. ఇది పొమ్మనలేక పొగ పెట్టడమా .. లేక .. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని .. ప్రశ్నించే వారి పదవికి ఎసరు పెట్టడమా? అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (telanganaCMO)  ఈ రోజు ఈటల పై 10 మంది  కంప్లైంట్ చేయగానే 10 నిమిషాల్లో స్పందించి  విచారణకు ఆదేశించిన మీరు, అన్యాయం జరుగుతుంది చంద్రశేఖరా .. అని మంత్రి మల్లారెడ్డి పై, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పై ఆరోపణలు చేసినప్పుడు.. మాభూములను ఎమ్మెల్యే సైదిరెడ్డి కబ్జా చేసిండని జనం మొత్తుకొన్నప్పుడు  మీకు వినిపించలేదా? అని వైఎస్ షర్మిల నిలదీశారు. మీకు సలాంలు  కొట్టి .. గులాంగిరి  చేసే వాళ్లకు ఏ ఆపద ఉండదా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే .. అవినీతి ఆరోపణలు ఎదురుకొంటున్న మీ పార్టీ ప్రతినిధులపై కూడా విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు.