నా బిడ్డ విషయంలో ఎందుకు న్యాయం జరగడంలేదు: అయేషా మీరా తల్లి

నా బిడ్డ విషయంలో ఎందుకు న్యాయం జరగడంలేదు: అయేషా మీరా తల్లి

దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్ పై ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం స్పందించారు. దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేసిన ఆమె…నాలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దిశ పై అఘాయిత్యానికి పాల్పడి అన్యాయం చేసిన వారు సామాన్యులు.. ఎలాంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టి ఈజీగా వారిని కాల్చిచంపేశారన్నారు. అదే పన్నెండేళ్ల క్రితం అత్యాచారానికి, హత్యకు గురైన తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు న్యాయం జరగడం లేదని ప్రశ్నించారు.

సీపీ సజ్జనార్ లాంటి పోలీసు అధికారి తమ కుమార్తె కేసు దర్యాప్తు చేసి ఉంటే తమకు న్యాయం జరిగి ఉండేదేమోనని ఆమె అన్నారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై సజ్జనార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

19ఏళ్ల ఫార్మాసీ విద్యార్థిని అయేషామీరాను గుర్తు తెలియని వ్యక్తులు 2007, డిసెంబరు 27న విజయవాడలోని ఆమె నివాసం ఉంటున్న హాస్టల్ లోనే అత్యాచారం చేసి హత్య చేశారు.