ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకుపోవుడు ఎందుకు? : కవిత

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకుపోవుడు ఎందుకు? :  కవిత

హైదరాబాద్, వెలుగు :  మేడిగడ్డ ఏమైనా టూరిస్ట్ స్పాటా.. అక్కడికి  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకుపోవుడు ఎందుకు? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మండలిలో శనివారం ఆమె మాట్లాడారు. ‘‘మేడిగడ్డ, అన్నారంలో చాలా ఘోరాలు జరిగాయని పదేపదే సీఎం రేవంత్ అంటున్నారు. ప్రభుత్వం ఉన్నది కదా.. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ జరిపించండి.

కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకుపోవుడు ఎందుకు? అదేమైనా టూరిస్ట్ స్పాటా? నిపుణుల కమిటీని తీసుకెళ్లండి” అని అన్నారు. కాగా, మండలి వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ లో కవిత మాట్లాడారు. గవర్నర్​ప్రసంగంలో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలను నిరంకుశ, నియంతృత్వ ప్రభుత్వాలుగా చెప్పించడం అభ్యంతరకరమని అన్నారు.