ఔటర్ రింగురోడ్డుపై  ప్రమాదం.. భార్యభర్తలు మృతి

ఔటర్ రింగురోడ్డుపై  ప్రమాదం.. భార్యభర్తలు మృతి

అంబర్ పేట దగ్గర ఔటర్ రింగురోడ్డుపై  ప్రమాదం జరిగింది. ఏపీ తుని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న భార్యభర్తలు స్పాట్ లో చనిపోయారు. వీరిని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కోహెడ గ్రామానికి చెందిన రంగారెడ్డి, వజ్రమ్మగా పోలీసులు గుర్తించారు. శుభకార్యానికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి హయత్ నగర్ డిపో లో కండక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది.