రంగారెడ్డి: దారుణం..ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా కడతేర్చింది.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. నిద్రలో ఉన్నోడిని చంపేసింది. ఏమీ తెలియనట్టు అనుమానాస్పద మృతిగా చిత్రీకరించే ప్లాన్ చేసింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తోంది. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న అల్లంపల్లి విజయ్ కుమార్, సంధ్య భార్యభర్తలు.. వీరికి ముగ్గురు పిల్లలు. విజయ్ కుమార్ ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంధ్య పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. ముగ్గురు పిల్లలతో సంసారం చక్కగా సాగుతున్న క్రమంలో సంధ్య వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది.
భార్య సంధ్య మరో వ్యక్తి వివాహేతర సంబంధం సాగిస్తున్న విషయం భర్త విజయ్ తెలియడంతో మందలించాడు.. ఈక్రమంలో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని విజయ్పై సంధ్య కోపం పెంచుకుంది.. ఎలాగైన భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది.
శనివారం రాత్రి నిద్రలో ఉన్న భర్త విజయ్ ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. ఇనుపరాడ్డుతో తలపైకొట్టి హతమార్చింది.. ఏమీ తెలియనట్లు శవాన్ని ఇంటిముందు పడేసి అనుమానాస్పద మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
మృతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హంతకుడిని పట్టుకునే పనిలో పడ్డారు.. లేటెస్ట్ టెక్నాలజీతో విజయ్ ని చంపింది సంధ్యే నని అనుమానించారు. సంధ్య ని విచారిస్తే అసలు విషయం బయటికొచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే భర్త విజయ్ని తాను హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది.
