భర్తను చిత్రహింసలు పెట్టిన భార్య ప్రియుడు

భర్తను చిత్రహింసలు పెట్టిన భార్య ప్రియుడు

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధంపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన భర్తను.. ఆమె ప్రియుడు అతన్ని తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆ ఫొటోలను దిగి ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో, అది గమనించిన భర్త తన భార్య వివాహేతర సంబంధంపై ఆవేదన చెంది వారిద్దరూ మృతి చెందారని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.. దీంతో భార్య ప్రియుడు అతనిపై దాడికి పాల్పడ్డారడు. దాంతో పాటు అతనికి గుండు కొట్టించి, సైలెన్సర్ తో కాల్చి హింసించారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోని చంద్రగిరి‌ మండలంలో జరిగింది.

అసలేమైందంటే..

తిరుపతిలోని ఏ.రంగంపేటకు చెందిన హరికృష్ణ నాయుడు కుమారుడు వంశీ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఓ మహిళను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆటో యజమాని తిరుపతి రూరల్ మండలం, ముస్లింపేటకు చెందిన అన్వర్ తరచూ వంశీ వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. అదే సమయంలో వంశీ భార్యతో అన్వర్ కి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో వంశీ ఇంట్లో‌లేని సమయంలో తరచూ అన్వర్ వంశీ భార్య వద్దకు వచ్చి వెళ్తూ ఉండడంతో.. ఈ విషయాన్ని చుట్టు ప్రక్కల వాళ్ళు వంశీకి చెప్పారు. విషయం తెలుసుకున్న వంశీ, భార్యను నిలదీశాడు. ఆ తర్వాత వంశీ భార్య రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోతున్నానని చెప్పి ప్రియుడు అన్వర్ దగ్గరికి వెళ్లిపోయింది. దీంతో వంశీ ఆటో నడపడం మానేసి, బెంగళూరులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే నెలన్నర క్రితం తన భార్య ఫేస్ బుక్ లో మరో వ్యక్తితో ఉన్నట్లు వంశీ గుర్తించాడు. గత నెల 13న తన భార్యతో పాటు అన్వర్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో మెసేజ్ పోస్టు చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని ఆన్వర్, చంద్రగిరికి చెందిన తన స్నేహితుడు హర్షతో కలిసి బెంగళూరులోని వంశీని కిడ్నాప్ చేసి చంద్రగిరికి తీసుకొచ్చాడు. కొంతమంది స్నేహితులతో కలిసి వంశీని చిత్ర హింసలకు గురి చేశాడు. అంతే కాకుండా సైలెన్సర్ తో శరీరం అంతా కాల్చారు. తలపై మూత్రం పోసారు. అంతటితో ఆగకుండా వంశీకి గుండు కొట్టించి వీడియోలు చిత్రీకరించారు. అనంతరం బాధితుడిని బెదిరించి అన్వర్ అనే వ్యక్తిపై తప్పుగా పోస్టులు పెట్టానని, అందుకు ప్రాయశ్చితంగా గుండు కొట్టించుకున్నట్లు బలవంతంగా ఓ వీడియోను చిత్రీకరించి వైరల్ చేశారు. అన్వర్ దురాగతంపై శుక్రవారం వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ ఘటనపై ఫిర్యాదు రాకపోయినప్పటికీ కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు..  దర్యాప్తు సాగిస్తున్నారు.