భర్తను చంపడంలో ఈమెది మరో లెవల్.. ప్రియుడు చంపుతుంటే వీడియో తీసింది

భర్తను చంపడంలో ఈమెది మరో లెవల్.. ప్రియుడు చంపుతుంటే వీడియో తీసింది

జనాలు బరి తెగిస్తున్నారు. కొంతమంది పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారో ... తరువాత ఎందుకు వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్నవారికి ఎందుకు ద్రోహం చేస్తారో తెలియని పరిస్థితి.  ప్రస్తుతం సమాజంలో ఓ పక్క అత్యాచార ఘటనలు... మరో పక్క వివాహేతర సంబంధాలతో కట్టుకున్న వారిని వారే కడతేరుస్తున్నారు.  

అత్యాచారాల కేసుల్లో పురుషుల పాత్ర ఉండగా ... వివాహేతర సంబంధాల విషయంలో మాత్రం మహిళలు బరితెగించేస్తున్నారు.  బతికున్నంత కాలం నీతో జీవించి ఉంటానని  ప్రమాణం చేసిన భార్యలు భర్తలను అన్యాయంగా చంపేస్తున్నారు.  తాజాగా విశాఖపట్నంలో ఓ మహిళ పాడు పని చేయడమే కాకుండా ప్రియుడితో కలిసి భర్తను చంపిన దారుణ ఉదంతం వెలుగుచూసింది. తాను ఎంతో అందంగా ఉంటానని భ్రమించే శివానీ అనే మహిళ   ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత.. కానిస్టేబుల్ అయిన తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. మరింత ఘోరం ఏమిటంటే.. తన భర్తని ప్రియుడు చంపుతుండగా, దాన్ని భార్య తన ఫోన్‌లో రికార్డ్ చేసింది. 

విశాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం శివానితో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. గత కొంతకాలం నుంచి శివాని.. రామారావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసుకున్న రమేష్.. భార్యని మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. తన ప్రియుడు రామారావుతో కలిసి ప్రేమాయణం  కొనసాగించింది.  భార్యలో మార్పు రాకపోవడంతో .. రమేష్  మద్యానికి బానిస అయ్యాడు. 

శివాని  ప్రియుడితో పూర్తిగా కలసి ఉండేందుకు భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని ప్రియుడు రామారావుతో కలిసి చంపేందుకు కుట్ర పన్నింది.  అయితే రమేష్.. శివానీ వివాహ సమయంలో శివానీ కుటుంబ సభ్యులు అర ఎకరం పొలం ఇచ్చారు.  దానిని అమ్మేసి ప్రియుడితో సెటిల్ అవుదామని భావించింది.  భర్త రమేష్ ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి రూ.2 లక్షల సుపారీ ఇచ్చి.. రమేష్‌ను చంపేందుకు శివాని, రామారావు కలిసి ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం.. శివాని తన భర్తకు మత్తు ట్యాబ్లెట్స్ ఇచ్చింది. అవి వేసుకున్న తర్వాత రమేష్ గాఢ నిద్రలోకి జారిపోయాడు. అప్పుడు ప్రియుడు, నీలా కలిసి తలదిండు మొహానికి అడ్డుపెట్టి చంపేశారు. భర్తను చంపే సమయంలో శివాని తన ఫోన్‌లో వీడియో తీసింది. అనంతరం తనకేమీ తెలియదన్నట్టు డ్రామా ఆడింది. కాల్‌డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా లోతైన దర్యాప్తు చేయగా.. భార్యే హంతకురాలని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధం కోసమే భర్తని చంపినట్టు శివాని ఒప్పుకుంది. శివాని తల్లిదండ్రుల మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.