యాదాద్రి కొండపై అడవి పంది హల్ చల్ 

యాదాద్రి కొండపై అడవి పంది హల్ చల్ 

యాద‌గిరిగుట్ట: యాదాద్రి కొండపై అడవి పంది హల్ చల్  చేసింది. మధ్యాహ్న సమయంలో క్యూ లైన్ లో నుంచి ఆలయ మాఢవీధిలోకి వచ్చిన అడవి పంది.. భయంతో అటు ఇటు పరిగెడుతూ భక్తులను భయాందోళనకు గురి చేసింది. క్యూ కాంప్లెక్స్ భవనంపై నుంచి దూకటంతో అడవి పంది చనిపోయింది. దీంతో ఆ కళేబరాన్ని ఆలయ సిబ్బంది తొలగించారు. అడవి పంది చనిపోయిన ప్రదేశాన్ని శుభ్రపరిచి.. ఆలయ పరిసరాల్లో లఘు పుణ్యాహ వచన కార్యక్రమాన్ని చేపడుతామని ఆలయ అర్చకులు తెలిపారు.