హిజాబ్ బ్యాన్పై విచారణలో సుప్రీం బెంచ్
న్యూఢిల్లీ: రైట్ టు డ్రెస్ అంటే రైట్టు నాట్ డ్రెస్ కూడానా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హిజబ్ బ్యాన్కు సంబంధించి విచారణ సందర్భంగా లాయర్ వాదనలను తప్పుబట్టిన బెంచ్ ఈ కామెంట్ చేసింది. ఈ విషయాన్ని సంబంధంలేని వైపునకు తీసుకెళ్లొద్దని సూచించింది. కర్నాటక హైకోర్టు విద్యా సంస్థల్లో హిజబ్ ను బ్యాన్ చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై బుధవారం బెంచ్, లాయర్కు మధ్య సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ఒక వర్గం మాత్రమే స్కార్ఫ్(హిజబ్)ను ధరించాలని చెబుతున్నారని, మిగతా అన్ని వర్గాలు కూడా డ్రెస్ కోడ్ను పాటిస్తున్నాయని, వారు మేము ఇదే ధరిస్తాం.. అదే వేసుకుంటాం అని చెప్పడం లేదు కదా! అని ప్రశ్నించింది. చాలా మంది స్టూడెంట్లు రూద్రాక్షలు, క్రాస్ సింబల్ వంటివి ధరిస్తున్నారని కామత్ చెప్పారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. వారు వాటిని చొక్కా లోపల ధరిస్తున్నారని, ఎవరు వాటిని చొక్కా తీసి అతను రుద్రాక్ష వేసుకున్నాడో లేదో చూడరు కదా! అని ప్రశ్నించింది. రైట్టు డ్రెస్ అంటే రైట్టు నాట్ డ్రెస్ కాదు కదా! అని పేర్కొంది. మతపరమైన అంశాలకు సంబంధించి ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయని, స్కూల్లో అందరు విద్యార్థులు ఒకే యూనిఫాం ధరించాల్సి ఉంటుందని బెంచ్ పేర్కొంది.
27న టైమ్లైన్ను నిర్ణయిస్తం
కేంద్రం, ఢిల్లీ సర్కార్ల అధికార పరిధిపై సుప్రీం
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల అధికారాల పరిధికి సంబంధించిన వివాదాస్పద అంశంపై విచారణకు సంబంధించి ఈ నెల 27న టైమ్లైన్ను నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఎలాంటి పేపర్లు లేకుండా ఈ ప్రొసీడింగ్స్ను నిర్వహిస్తామని, అందుకే ఇదో గ్రీన్ బెంచ్ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.