బీజేపీతో కలిసి పనిచేస్తం: జేడీఎస్​ నేత కుమారస్వామి

బీజేపీతో కలిసి పనిచేస్తం: జేడీఎస్​ నేత కుమారస్వామి

బెంగళూరు: కర్నాటక ప్రయోజనాల కోసం రాష్ట్రంలో బీజేపీతో కలిసి పనిచేస్తామని జేడీఎస్​నేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించారు. బెంగళూరులో జరిగిన జేడీఎస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్​లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. జేడీఎస్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని పార్టీ చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ తనకు అనుమతిచ్చారని తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏలో కూటమిలో చేరుతారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. దాని గురించి మాట్లాడేందుకు ఇంకా టైముందన్నారు.