వింబుల్డన్‌‌‌‌‌‌‌‌లో రుడ్‌‌‌‌‌‌‌‌కు షాక్‌‌‌‌‌‌‌‌

వింబుల్డన్‌‌‌‌‌‌‌‌లో రుడ్‌‌‌‌‌‌‌‌కు షాక్‌‌‌‌‌‌‌‌

వింబుల్డన్‌‌‌‌‌‌‌‌: వింబుల్డన్‌‌‌‌‌‌‌‌లో నాలుగో రోజు సంచలనం నమోదైంది. నార్వే స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, నాలుగోసీడ్‌‌‌‌‌‌‌‌ కాస్పర్‌‌‌‌‌‌‌‌ రుడ్‌‌‌‌‌‌‌‌కు రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఊహించని షాక్‌‌‌‌‌‌‌‌ తగిలింది. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అన్‌‌‌‌‌‌‌‌సీడెడ్‌‌‌‌‌‌‌‌ లియామ్‌‌‌‌‌‌‌‌ బ్రాడీ (బ్రిటన్‌‌‌‌‌‌‌‌) 6–4, 3–6, 4–6, 6–3, 6–0తో రుడ్‌‌‌‌‌‌‌‌ను ఓడించి మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లాడు. 3 గంటలా 27 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 10 ఏస్‌‌‌‌‌‌‌‌లు, 42 విన్నర్స్‌‌‌‌‌‌‌‌ సాధించినా 8 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌, 53 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌తో మూల్యం చెల్లించుకున్నాడు. 9 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో మూడింటిని మాత్రమే కాచుకున్నాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో 5 ఏస్‌‌‌‌‌‌‌‌లే కొట్టిన బ్రాడీ, 56 విన్నర్స్‌‌‌‌‌‌‌‌, 49 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

కానీ 13 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో ఆరు కాపాడుకుని మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గెలిచాడు. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఏడోసీడ్‌‌‌‌‌‌‌‌ రుబ్లెవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా) 6–7 (4), 6–3, 6–4, 7–5తో కరాట్సెవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా)పై, 19వ సీడ్‌‌‌‌‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ) 6–4, 7–6 (4), 7–6 (5)తో బ్రౌవెర్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌)పై, వావ్రింకా (స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌) 6–3, 4–6, 6–4, 6–2తో ఎట్చెవారి (అర్జెంటీనా)పై, బెరెటినీ (ఇటలీ) 6–7 (5), 6–3, 7–6 (7), 6–3తో సోనెగో (ఇటలీ)పై నెగ్గారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌) 6–1, 1–6, 6–1తో మార్టినెస్‌‌‌‌‌‌‌‌ (బెల్జియం)పై, గార్సియా (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌) 3–6, 6–4, 7–6 (6)తో ఫెర్నాండేజ్‌‌‌‌‌‌‌‌ (కెనడా)పై నెగ్గారు.