విరాటపర్వం ఈవెంట్లో కూలిన స్టేజ్, LED స్క్రీన్

విరాటపర్వం  ఈవెంట్లో కూలిన స్టేజ్, LED స్క్రీన్

కర్నూలు : కర్నూలులోని ఔట్ డోర్ స్టేడియంలో జరుగుతున్న విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి అంతరాయం ఏర్పడింది. ఏపీలో పలుచోట్ల వర్షం పడుతుండగా.. కర్నూలులో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. కర్నూలులోనూ పలుచోట్ల ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్నూలులోని ఔట్ డోర్ స్టేడియంలో జరుగుతున్న విరాటపర్వం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బిగ్ స్క్రీన్లు గాలికి పడిపోయాయి.  భారీగా వీచిన గాలితో స్టేజ్ పడిపోవడంతో అందరు పరుగులు తీశారు. స్టేజ్ వెనుక ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  వెంటనే అప్రమత్తమైన ఈవెంట్ నిర్వాహకులు.. కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలిసింది. అయితే  హీరో దగ్గుబాటి రానా, హీరోయిన్ సాయి పల్లవి రాక ముందే  ఈ ఘటన చోటుసుకోవడంతో .. ఈవెంట్ జరుగుతుందా.. వాయిదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. 

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం.. మూడేళ్ల  తర్వాత జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వబోతోంది. ఇందులో రానా, ప్రియమణి నక్సలైట్ గా కనిపించబోతున్నారు. పోస్టర్స్ .. స్పెషల్  వీడియోస్ తో సందడి చేస్తున్న ఈసినిమా నుంచి సాలిడ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ ట్రైలర్ లో నట విశ్వరూపంచూపించారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి మెయిన్ లీడ్ అని, ఆమె విశ్వరూపం చూస్తారని సాయి పల్లవి గురించి  రీసెంట్ గా  డైరెక్టర్ వేణు ఓ రేంజ్ లో చెప్పారు.  ఈ సినిమా ట్రైలర్ లోనూ సాయి పల్లవి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.