రేపు ఎల్లుండి వైన్ షాపులు, బార్లు బంద్

రేపు ఎల్లుండి వైన్ షాపులు, బార్లు బంద్

మందుబాబులకు మింగుడుపడని విషయం ఇది. హోలీ సందర్భంగా జంటనగరాల్లో లిక్కర్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నిర్ణయించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని సీపీ తెలిపారు. రోడ్డపై రంగులు చల్లడం, గుంపులుగా తిరగొద్దని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.