
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైన్స్ షాపులు మూతపడ్డాయి. హోలి వేడుకల సందర్భంగా వైన్స్ షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 2024 మార్చి 24న సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి (మార్చి 26) ఉదయం 6 గంటల వరకు వైన్స్ షాపులు బంద్ ఉంటాయని వెల్లడించింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. మద్యం దుకాణాలతో పాటు.. కల్లు కంపౌడ్లు, బార్లు, అటాచ్ టు రెస్టారెంట్లు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.
రేపు(మార్చి 25) రాష్ట్ర వ్యాప్తంగా హోలీ వేడుకలు జరగనున్నాయి. కొంతమంది మద్యం ప్రియులు వైన్ షాపులు క్లోజ్ చేస్తారన్న సమాచారంతో.. పెద్ద సంఖ్యలో మద్యం షాపులకు క్యూ కట్టారు. హోలీ పండగకు కావాల్సిన కిక్కును ముందుగానే కొనుగోలు చేశారు.
హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా మద్యం షాపులు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు.
ఇవాళ(మార్చి 24) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం(మార్చి 26) ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయలని సైబరాబాద్ సీపీ ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని.. సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు.