యాదాద్రి, వెలుగు: పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైన్స్లను మూసివేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో ఈ నెల 11న ఎన్నికలు జరిగే ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూర్ (ఎం), బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో మంగళవారం నుంచి గురువారం కౌంటింగ్ ముగిసే వరకూ మూసి వేయాలన్నారు.
సెకండ్ ఫేజ్లో భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లో 14న ఎన్నికలు జరుగుతున్నందున 12 నుంచి 14న కౌంటింగ్ముగిసేంతవరకూ మూసివేయాలన్నారు. థర్డ్ ఫేజ్లో ఈ నెల 17న చౌటుప్పల్, నారాయణపూర్, అడ్డగూడూర్, మోత్కూర్, గుండాల, మోటకొండూర్ లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 15 నుంచి 17న కౌంటింగ్ ముగిసేంతవరకూ వైన్స్లను మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

