హైదరాబాద్, వెలుగు:వినాయక నిమజ్జనాలు,శోభాయాత్ర సందర్భంగా ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్కమిషనరేట్పరిధిలో లిక్కర్అమ్మకాలపై పోలీసులు నిషే ధం విధించారు. 17న ఉదయం 6 గంటల నుంచి 18న సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సిటీ సీపీ సీవీ ఆనంద్ఆదేశించారు.
ఈ మేరకు గురువారం నోటిఫికేషన్రిలీజ్చేశారు. స్టార్ హోటల్స్, రెస్టారెంట్లలోని బ్లార్లను కూడా క్లోజ్చేయాలని స్పష్టం చేశారు. రూల్స్బ్రేక్చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాలని పోలీస్సిబ్బందిని
ఆదేశించారు.
