
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ర్టానిక్స్ కంపెనీ శామ్సంగ్ ఇండియా మార్కెట్లోకి వైర్లైస్ పవర్బ్యాంకుతోపాటు చార్జర్ డుయోపాడ్ను విడుదల చేసింది. శామ్సంగ్ ఫోన్లతోపాటు ఇతర ఫోన్లనూ (క్యూఐ టెక్నాలజీ సర్టిఫైడ్వి మాత్రమే) దీనితో వైర్లైస్గా చార్జ్ చేసుకోవచ్చు. గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్లనూ చార్జ్ చేయవచ్చు. పవర్ బ్యాంక్లోనే వైర్లెస్ చార్జింగ్ ప్యాడ్ ఉంటుంది. వైర్లెస్తోపాటు వైర్ ఉన్న డివైజ్నూ ఇది చార్జ్ చేస్తుంది. దీని ధర రూ.3,699. వైర్లెస్ చార్టర్ డుయో ప్యాడ్ ఒకే సమయంలో రెండు డివైజ్లను చార్జ్ చేయగలుగుతుంది. దీని ధర రూ. 5,999. ఈ రెండు పరికరాలు ఫాస్ట్ చార్జింగ్ను సపోర్ట్ చేస్తాయి. శామ్సంగ్ ఈ–షాప్తో పాటు దేశవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో వీటిని కొనుక్కోవచ్చు.