ముగ్గురు భారత క్రికెటర్లకు బర్త్ డే విషెస్

ముగ్గురు భారత క్రికెటర్లకు బర్త్ డే విషెస్

భారత క్రికెట్ అభిమానులకు ఇవాళ స్పెషల్ డే..ఎందుకంటే ఇవాళ(డిసెంబర్ 6) ముగ్గురు  క్రికెటర్ల పుట్టిన రోజు ఒకే రోజు కావడం.  భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా,  డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా, యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పుట్టిన రోజు. ప్రస్తుతం ఈ ముగ్గురు క్రికెటర్లు ఆస్ట్రేలియా టూర్ లో బిజీగా ఉన్నారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు.  ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టీ20లో జడేజా గాయపడ్డాడు. ఈ ముగ్గురి క్రికెటర్లకు బీసీసీఐ  ట్విట్టర్లో  బర్త్ డే విషెస్ చెప్పింది. ఇటీవల జరిగిన ఐపీఎల్   టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా బుమ్రా రికార్డ్ సృష్టించాడు.అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ జట్టును రన్నరప్ గా నిలిపాడు.

భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ కెరీర్

బుమ్రా       

14 టెస్టుల్లో  68 వికెట్లు

67 వన్డేల్లో 108 వికెట్లు

49 టీ20 లలో  59 వికెట్లు

జడేజా

49 టెస్టుల్లో 213 వికెట్లు, 1869 పరుగులు

168 వన్డేల్లో 188 వికెట్లు, 2411 పరుగులు

50 టీ20ల్లో 39 వికెట్లు, 217 పరుగులు

శ్రేయస్ అయ్యర్

21 వన్డేల్లో 807 పరుగులు

22 టీ20ల్లో  417 పరుగులు