ఎడ్యుకేషన్ పై కరోనా ఎఫెక్ట్..అకడమిక్ ఇయర్ ఆలస్యం!

ఎడ్యుకేషన్ పై కరోనా ఎఫెక్ట్..అకడమిక్ ఇయర్ ఆలస్యం!

హైదరాబాద్, వెలుగు:  ఏటా జూన్​లో విద్యాసంవత్సరం ప్రారంభం కావడం, ఏప్రిల్​లో ముగియడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఈ అకడమిక్​ ఇయర్​ ఏప్రిల్​లో ముగిసేలా లేదు. వచ్చే అకడమిక్​ ఇయర్​ జూన్​లో ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. ప్రతి అకడమిక్ ఇయర్​లో స్కూళ్లు, కాలేజీలు 220 రోజులు తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అకడమిక్​ ఇయర్​ మాత్రం కరోనా ఎఫెక్ట్​తో అది సాధ్యపడలేదు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో స్కూళ్లు, కాలేజీలకు బాగానే సెలవులు ఇచ్చారు. ఈసారి ఒంటిపూట బడులు ప్రారంభం కాకుండానే.. కరోనా ఎఫెక్ట్​తో సెలవులు వచ్చేశాయి. దీంతో టెన్త్, ఇంటర్ మినహా మిగిలిన డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ తోపాటు ఇతర ప్రొఫెషనల్​ కోర్సుల సిలబస్ పూర్తి కాలేదు. ఏప్రిల్ ఫస్ట్​వీక్​లో ఫస్ట్ క్లాస్​నుంచి నైన్త్  క్లాస్​ వరకున్న స్టూడెంట్స్​కు ఎస్​ఏ–2 ఎగ్జామ్స్​ నిర్వహించాల్సి ఉన్నా.. లాక్​ డౌన్​ నేపథ్యంలో సాధ్యపడలేదు. దీంతో ఆయా క్లాసుల్లోని సుమారు 52 లక్షల మంది స్టూడెంట్స్​ను పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది.

పబ్లిక్ ఎగ్జామ్స్​ పోస్ట్​పోన్​

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ ఒకేషనల్​, డిగ్రీ సెమిస్టర్స్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్​తో పాటు పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్​ పరీక్షలు షెడ్యూల్​ ప్రకారం మార్చి19 నుంచి ఏప్రిల్​ 6 వరకు జరగాల్సి ఉండె. కానీ మార్చి 21 వరకు ఫస్ట్​, సెకండ్​ లాంగ్వేజ్​ ఎగ్జామ్స్ మాత్రమే జరిగాయి. కరోనా కారణంగా, హైకోర్టు ఆదేశాలతో టెన్త్​లోని మిగిలిన ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్​వాయిదా పడ్డాయి. మరోపక్క ఇంటర్మీడియెట్ మెయిన్​ సబ్జెక్టుల ఎగ్జామ్స్ అన్నీ పూర్తయినా.. ఇంటర్ ఒకేషనల్ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్- 2, జియోగ్రఫీ పేపర్ -2 వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 4 నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్ ఎగ్జామ్స్​కూడా పోస్ట్ పోన్​ అయ్యాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరగాల్సిన అంబేద్కర్  ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలతో పాటు అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పీజీ సెమిస్టర్స్, ఇంజినీరింగ్​ సెమిస్టర్స్ వాయిదా పడ్డాయి. మార్చి19 నుంచి మార్చి 31 మధ్య జరగాల్సిన టెన్త్, 11, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా వేసింది.

ఎంట్రెన్స్​ ఎగ్జామ్స్ అన్నీ వాయిదా

రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా కరోనా ఎఫెక్ట్​తో వాయిదా పడ్డాయి. మే 2న ఈసెట్, మే 4 నుంచి జరగాల్సిన ఎంసెట్ ఎంట్రెన్స్​తో పాటు ఐసెట్, పీఈసెట్, లాసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ పరీక్షలూ,  వీటితో పాటు డీసెట్, పాలిసెట్,  మోడల్ స్కూల్​ఎంట్రెన్స్ ఎగ్జామ్, గురుకుల ప్రవేశాల పరీక్ష కూడా పోస్ట్ పోన్​ అయ్యాయి. జాతీయ స్థాయిలో జేఈఈ, నీట్​తో పాటు పలు ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి.

వాల్యుయేషన్​, రిజల్ట్స్​ లేట్​

కరోనా కట్టడికి లాక్​డౌన్​ విధించడంతో రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో ప్రారంభమైన ఇంటర్  స్పాట్ వాల్యుయేషన్ వాయిదా పడింది. మే ఫస్ట్​వీక్​లో ఇంటర్ వాల్యుయేషన్​ ప్రారంభించినా.. గతంలో మాదిరిగా 12 కేంద్రాల్లో నిర్వహిస్తే మాత్రం రెండు నెలలు పడుతుంది. ఇంటర్ రిజల్ట్స్​ ఆధారంగానే ఎంసెట్ రిజల్ట్స్, డిగ్రీ అడ్మిషన్లు ఉంటాయి.  జాతీయస్థాయి పరీక్షలనూ దృష్టిలో పెట్టుకొని రిజల్ట్స్​ ప్రాసెస్​ను వేగంగా నిర్వహించాల్సి ఉంది. మరోపక్క టెన్త్ ఎగ్జామ్స్​మే చివరి వారంలో పెట్టినా.. జూన్​చివరి వారం లేదా జులై ఫస్ట్​వీక్​లో రిజల్ట్స్​ ఇచ్చే చాన్​ ఉంటుంది. టెన్త్ రిజల్ట్స్​పైనే ఇంటర్, పాలిటెక్నిక్ అడ్మిషన్లు ఆధారపడి ఉంటాయి. మే ఫస్ట్ వీక్​ వరకూ కరోనా ప్రభావం తగ్గితేనే ఇదంతా జరిగేది. లేదంటే ఈ ప్రక్రియంతా మళ్లీ వాయిదా పడుతుంది.

ఎస్ఎస్సీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్​ కూడా

దేశవ్యాప్తంగా 4,800పైగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్​సీ) గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన సీహెచ్ఎస్ఎల్, జేఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 20 నుంచి 28 వరకు జరగాల్సిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్​ఎస్​ఎల్) టైర్-1 ఎగ్జామ్స్, అదేవిధంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగాల్సిన జూనియర్ ఇంజనీర్ (జేఈ)  టైర్ ఎగ్జామ్స్​ పోస్ట్ పోన్​ అయ్యాయి. ఇండియన్‌‌‌‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ అకాడమీ (ఎన్‌‌‌‌డీఏ), నావెల్‌‌‌‌ అకాడమీ (ఎన్‌‌‌‌ఏ) పరీక్షలూ వాయిదా పడ్డాయి. నోటిఫికేషన్‌‌‌‌ ప్రకారం ఎన్‌‌‌‌డీఏ, ఎన్‌‌‌‌ఏ ఎగ్జామ్స్​ ఏప్రిల్‌‌‌‌ 19న జరగాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్​తో  పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు యూనియన్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (యూపీఎస్సీ) ప్రకటించింది.