100లకు బదులు రూ.500 డ్రా..ఏటీఎంకు క్యూ క‌ట్టిన జ‌నాలు

100లకు బదులు రూ.500 డ్రా..ఏటీఎంకు క్యూ క‌ట్టిన జ‌నాలు

వనపర్తి జిల్లా: ఏటీఎంలో టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ వ‌ల్లో రూ.100 కొడితే 500 వ‌చ్చిన సంఘ‌ట‌న శ‌నివారం వ‌న‌ప‌ర్తి జిల్లాలో జ‌రిగింది. ఇండియా నెం.1 ఏటీయంలో... రూ. 100లకు బదులు ఏకంగా రూ.500 డ్రా అయ్యాయి. అలా చేస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. విష‌యం తెలియ‌గానే స్థానికులు ఒక్కొక్కరూగా వచ్చి డబ్బులు డ్రా చేసి సంబరాల్లో మునిగిపోయారు.

అయితే పోలీసులు పెట్రోలింగ్‌కు రావడంతో అక్కడి నుంచి పారిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. వెంటనే సంబంధిత ఏటీయం అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఏటీయంలోని సాంకేతిక లోపాన్ని గుర్తించి సరి చేశారు. అమౌంట్ భారీగానే పోయిన‌ట్లు గుర్తించిన బ్యాంకు సిబ్బంది.. ఏటీఎం కార్డుల ఆధారంగా అకౌంట్ల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డార‌ట‌.