
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పోలీసుల రక్షణ లేకుండా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు, గృహ నిర్భందాలు చేయకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం యాదాద్రి జిల్లా పర్యటన సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్, కార్యకర్తల అరెస్టును శనివారం ట్విట్టర్లో ఆయన ఖండించారు. 2023 ఎన్నికల తర్వాత తండ్రీకొడుకులను ఇంటికే పరిమితం చేస్తామని, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.