ఏం గుండెమ్మా నీది : మొగుడిని చంపి.. ఇంట్లోనే తగలబెట్టింది..

ఏం గుండెమ్మా నీది : మొగుడిని చంపి.. ఇంట్లోనే తగలబెట్టింది..

భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసింది ఓ భార్య.  ఈ అమానీయ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో మే 29న  చోటుచేసుకుంది.  తమ ఇద్దరు కుమారులు తమను పట్టించుకోవడం లేదని..  తండ్రి మరణవార్త తెలిస్తే ఇద్దరు కొడుకులు ఆస్తి కోసం  వచ్చి  గొడవ పడతారనే భయంతోనే తన భర్తకు ఇంట్లో అంత్యక్రియలు చేసినట్లు  మహిళ పోలీసులకు తెలిపింది.

పట్టణంలో ఫార్మాసిటీ నిర్వహిస్తున్న హరికృష్ణ ప్రసాద్‌  (60) , లలిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా, చిన్న కొడుకు కెనడాలో స్థిరపడ్డాడు.  అయితే  ఏమైందో ఏమో తెల్వదు కానీ..  సోమవారం ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకోగా.. ఇంట్లోనే తన భర్త అంత్యక్రియలు చేశానని ఆ మహిళ చెప్పింది.

తమ కొడుకులు తమ బాగోగులు చూసుకోవడం లేదని.. ఆస్తిలో వాటా ఇవ్వాలని మాత్రమే ఇంటికి వస్తున్నారని లలిత తెలిపింది. తండ్రి మరణవార్త గురించి చెబితే ఇంటికి వచ్చి ఆస్తి కోసం గొడవ పడతారేమోనని తన భర్తకు అట్టపెట్టలతో  ఇంట్లోనే దహన సంస్కారాలు చేసినట్లు చెప్పింది.

పోలీసులు మహిళను విచారించగా... ఆమె మానసిక స్థితి సరిగా లేదని వారు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టారు.