గోదావరిఖని, వెలుగు: మహారాష్ట్రకు చెందిన సీతాదేవి రైలులో ప్రయాణిస్తూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సీతాదేవి కుటుంబ సభ్యులతో కలిసి గూడూరు వద్ద బాగామతి ఎక్స్ప్రెస్ ఎక్కింది. ట్రైన్ వరంగల్ స్టేషన్ దాటిన తర్వాత పురిటి నొప్పులు అధికం కావడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెకు పురుడు పోశారు.
ట్రైన్ రామగుండం రైల్వే స్టేషన్కు చేరుకోగానే, 108లో ఈఎంటీ రవి, పైలట్ అనిల్ తల్లి, బిడ్డకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వారిని గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
