కోనరావుపేట మండలంలో .. ఆర్ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి

కోనరావుపేట మండలంలో .. ఆర్ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 

కోనరావుపేట, వెలుగు: అనారోగ్యంతో ఓ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీ వద్దకు వెళ్లగా.. వైద్యం వికటించి ఓ మహిళ చనిపోయిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన వంగపల్లి రేణుక(32) ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 21న తనకు ఒంట్లో బాగాలేదని గ్రామంలోని ఆర్ఎంపీ ద్యావనపెల్లి లక్ష్మీనారాయణ వద్దకు వెళ్లగా.. సెలైన్‌‌‌‌‌‌‌‌ ఎక్కించి, ఇంజక్షన్లు వేశాడు. వెంటనే ఆమెకు సీరియస్‌‌‌‌‌‌‌‌ కావడంతో సిరిసిల్ల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. అంత్యక్రియల అనంతరం భర్త శంకర్ తన పిల్లలను ఏం జరిగిందని అడగగా ‘డాక్టర్ అంకుల్ వచ్చి మమ్మీకి గ్లూకోజ్ ఎక్కించాడని, ఇంజక్షన్లు ఇవ్వడంతో మమ్మీకి వాంతులు చేసుకుని పడిపోయింది’ అని చెప్పారు. 

దీంతో శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీని పిలిచి విచారించారు. అయితే తాను ఎలాంటి వైద్యం చేయలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి వెళ్లిపోయాడు. అనంతరం ఇటీవల బాధితుడు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాల మేరకు డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీ నిర్లక్ష్యంతోనే రేణుక చనిపోయినట్లు తేలిందని డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో రజిత తెలిపారు. శనివారం వైద్యాధికారులు క్లినిక్‌‌‌‌‌‌‌‌ను సీజ్‌‌‌‌‌‌‌‌ చేసి, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీపై కేసు నమోదు చేశారు.