- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పరిధిలోప్రమాదం
 
తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్జిల్లా తొర్రూరులో గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. ఇంట్లోకి దూసుకెళ్లడంతో మహిళ చనిపోయింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. సోమవారం వరంగల్నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న గ్రానైట్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి తొర్రూరు మండలం నాంచారి మడూరులో రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లింది.
గోడ కూలి సెంట్రింగ్ బాక్సులు, కర్రలు ఇంటి ముందు నిల్చున తాండూరి లక్ష్మి(45)తలపై పడడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని స్థానికులు వరంగల్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలి బంధువు కర్రె నారాయణరెడ్డి ఫిర్యాదుతో లారీ డ్రైవర్నవాబ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
