వెలుగు ఫొటోగ్రాఫర్, వరంగల్: కోతుల బెడద నుంచి పంటను రక్షించుకునేందుకు ఓ మహిళా రైతు వినూత్న ఆలోచన చేశారు. మహేశ్వరం గ్రామానికి చెందిన భూక్యా రాధ రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసింది.
కాపు దశకు రాగానే కోతుల దండు వచ్చి చేనును పాడుచేయడంతో తీవ్రంగా నష్టపోయింది. దీంతో కోతులకు చెక్ పెట్టాలని భావించి ఆన్లైన్ లో రూ.2 వేలతో చింపాంజీ డ్రెస్ తెప్పించుకుంది. చింపాంజీ వేషధారణలో పొలంలో తిరుగుతూ కోతులను తరుముతోంది.
