బాలుడిని కిడ్నాప్ చేసి వివాహిత సహజీవనం

 బాలుడిని కిడ్నాప్ చేసి వివాహిత సహజీవనం
  • ఇంటి ఎదురుగా ఉన్న పిల్లాడిపై కన్ను
  • పోర్న్ వీడియోలు చూపిస్తూ ట్రాప్​

కూకట్ పల్లి, వెలుగు: బాలుడి (15)పై ఆమె మోజు పెంచుకుంది. అతడిని ట్రాప్​చేసి ఏపీ నుంచి హైదరాబాద్​కు తీసుకొచ్చింది. ఆ పిల్లాడితో సహజీవనం చేస్తున్న ఆ మహిళను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ గుడివాడలోని గుడ్ మెన్ పేటలో ఉండే ఓ మహిళ (30) కు పెళ్లయి నలుగురు పిల్లలున్నారు. అనారోగ్యం కారణంగా భర్త ఆమెను, పిల్లలను వదిలేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె  కాలనీలోని మైనర్లతో సెల్ ఫోన్ లో ఆన్ లైన్ వీడియో గేమ్ లు ఆడుతూ వారితో మాటలు కలిపేది. తన ఇంటి ఎదురుగా ఉన్న టెన్త్ క్లాస్ చదివే ఓ బాలుడి (15) ని మాయమాటలతో ఆమె ట్రాప్ చేసింది. అతడికి పోర్న్ వీడియోలు చూపించింది.

ఆ తర్వాత బాలుడితో సహజీవనం చేసింది. దీన్ని గమనించిన బాలుడి పేరెంట్స్ అతడిని మందలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఈ ఏడాది జూన్ 19న బాలుడిని హైదరాబాద్ ​తీసుకువచ్చి బాలానగర్ లో ఓ రూమ్ రెంట్ కు తీసుకుంది. కొడుకు కనిపించడం లేదంటూ అతని తల్లిదండ్రులు గుడివాడ టూ టౌన్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల తర్వాత ఆ మహిళ బాలుడితో కలిసి బాలానగర్​లో ఉంటున్నట్లు గుర్తించారు. బుధవారం హైదరాబాద్​చేరుకున్న గుడివాడ పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని గుడివాడకు తరలించారు. బాలుడిని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిపై పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు చేశారు.