ఎస్​జే సిండ్రోమ్​తో మహిళ మృతి.. కొత్త వైరస్ అంటూ ప్రచారం

ఎస్​జే సిండ్రోమ్​తో మహిళ మృతి..   కొత్త వైరస్ అంటూ ప్రచారం

కారేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా కారేపల్లి  మండలంలోని గేటు కారేపల్లి పంచాయతీలోని మందులవాడలో మేకల సుప్రియ (20) అనారోగ్యంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం చనిపోయింది. మృతురాలు స్టీవెన్​ జాన్సన్​ సిండ్రోమ్ ​అనే వ్యాధితో చనిపోవడంతో డెడ్​బాడీపై దద్దులు వచ్చి పట్టుకుంటే చర్మం ఊడిపోయింది. 

దీంతో కుటుంబీకులు డెడ్​బాడీని పట్టుకోకుండా హడావుడిగా గేట్​కారేపల్లి శ్మశానవాటికలో జేసీబీతో గొయ్యి తీయించి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులకు విషయం తెలియడంతో కొత్త వైరస్​తోనే చనిపోయిందని అనుకున్నారు.  అలాగే ప్రచారం జరగడంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. 

దీంతో సుప్రియ మృతిపై అనుమానాలు నివృత్తి చేయడానికి ఎంపీడీవో చంద్రశేఖర్,  మండల వైద్యాధికారి డాక్టర్ ​సురేశ్​ మందులవాడకు వచ్చి విచారణ జరిపారు. జిల్లా వైద్యబృందం ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు వెళ్లి వివరాలు తెలుసుకుంది. ఎస్​.జె.సిండ్రోమ్ తోనే చనిపోయినట్టు జిల్లా వైద్యబృందం నిర్ధారించిందని మండల వైద్యాధికారి సురేశ్ తెలిపారు.