ఇంక మారరా : రైల్వే స్టేషన్ల దగ్గర రీల్స్ పిచ్చోళ్లు..

ఇంక మారరా : రైల్వే స్టేషన్ల దగ్గర రీల్స్ పిచ్చోళ్లు..

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. షార్ట్ టైమ్ లో పాపులర్ అయ్యేందుకు కొంతమంది ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. కొందరైతే  ప్రమాదమని తెలిసినప్పటికీ రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తు్న్నారు.  ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కొల్పోతున్న తీరు మారటం లేదు.  ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. 

తాజాగా  ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న ట్రైన్ లో వెళ్తున్న అబ్బా్యి చేతు పట్టుకుని గుండ్రంగా తిరిగింది.  పొరపాటున ఆమె కిందపడిపోయింటే ప్లాట్‌ఫారమ్ మధ్యలో చిక్కుకుపోయి ఉండేది.  ఇక మరోక మహిళ రైలు వెళ్తుంటే రైలు ట్రాక్ కు చాలా దగ్గర నిలబడింది.  అంతటితో ఆగకుండా ఆ మహిళ కదులుతున్న రైలులో ప్రయాణికుల వైపు చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కనిపించింది.  ఆ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.    

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.  క్షణాల్లో వచ్చిపోయే రీల్స్ కోసం నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటారా అని మండిపడుతున్నారు. ఇలాంటివి మానుకోవాలని హితువు పలుకుతున్నారు.