మా బతుకులు ఆగం చేయొద్దు

మా బతుకులు ఆగం చేయొద్దు

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో ఓ మహిళ టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాళ్లు పట్టుకుంది. తమ గ్రామంలో ఫార్మా కంపెనీ పెట్టొద్దంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఫార్మాకంపెనీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడతామని,వేరే ఎక్కడైనా కంపెనీ పెట్టుకోవాలని కోరింది. తమ బతుకులు ఆగం కాకుండా చూడాలంటూ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి కాళ్లు మొక్కిందామె. తమ జీవితాలను కష్టాలపాలు చేయొద్దంటూ అక్కడ ఉన్న మరికొందరు మహిళలు కూడా ఆయనను ప్రాధేయపడ్డారు.

మరిన్ని వార్తల కోసం..

సీఎం మెడలు వంచి రాష్ట్రమంతా దళిత బంధు సాధించుకుందాం: వివేక్

ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌‌ఎస్ పార్టీ ధర్నాలు

విజయ్ సేతుపతిని తంతే రూ. వెయ్యి క్యాష్ ప్రైజ్