బ్రిజ్‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు విమెన్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌.. సీన్‌‌‌‌‌‌‌‌ రీ క్రియేషన్‌‌‌‌‌‌‌‌ కోసం

బ్రిజ్‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు విమెన్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌..  సీన్‌‌‌‌‌‌‌‌ రీ క్రియేషన్‌‌‌‌‌‌‌‌ కోసం

న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ చీఫ్‌‌‌‌‌‌‌‌ బ్రిజ్‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌ శరణ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సీన్‌‌‌‌‌‌‌‌ రీ క్రియేషన్‌‌‌‌‌‌‌‌ కోసం విమెన్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం బ్రిజ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చారు. దాదాపు అర్ధగంట పాటు అక్కడి ప్రాంతాలను చూపిస్తూ అప్పట్లో జరిగిన సంఘటనలపై ఆరా తీసినట్లు ఢిల్లీ పోలీస్‌‌‌‌‌‌‌‌ అధికారి తెలిపారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకోవాలని, అప్పట్లో బ్రిజ్‌‌‌‌‌‌‌‌ ఎలా వ్యవహరించాడన్న దానిపై కూడా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. 

అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రెజ్లర్లు రాజీ కోసం డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు వచ్చారని కథనాలు వెలువడ్డాయి. దీనిపై వినేశ్‌‌‌‌‌‌‌‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘విమెన్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్లు పోలీసు విచారణ కోసం నేర స్థలానికి వెళ్లారు. కానీ రాజీ కోసం వచ్చినట్లు కథనాలు వచ్చాయి. రాజకీయ అండదండలతో తప్పుడు కథనాలు సృష్టించడంలో బ్రిజ్​దిట్ట. అందుకే అతన్ని  అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలని మేం కోరుకుంటున్నాం’ అని వినేశ్‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేసింది.