రేప్ చేసి.. ఆపై నిప్పంటించారు!

రేప్ చేసి.. ఆపై నిప్పంటించారు!

శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ అత్యాచార, హత్య ఘటనపై ఓ వైపు దేశమంతా భగ్గుమంటుంటే, మరోవైపు ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్డా జిల్లాలో దిశ లాంటి ఘటనే జరిగింది. ఆ జిల్లాలోని ఓ మామిడి తోటలో కాలిన యువతి మృతదేహాన్ని అక్కడి రైతులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం పొలం పనులకు వెళుతున్న రైతులు దారి సమీపంలో ఓ యువతి శరీరం మంటల్లో కాలుతున్నట్లు గమనించి దగ్గరలోని ఇంగ్లీష్ బజార్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.  ఈ ఘటనపై  సమాచారమందుకున్న డీఎస్పీ ప్రశాంత్ దేబ్ నాథ్.. సంఘటనా స్థలానికి చేరుకొని యువతి డెడ్ బాడీని పరిశీలించారు.

ఘటనా స్థలంలో ఉన్న మృతదేహాన్ని బట్టి చనిపోయిన యువతి వయస్సు 20 ఏళ్లు ఉండొచ్చన్నారు డీఎస్పీ . ఆమె శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలున్నాయని, బాధితురాలు అత్యాచారానికి గురై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.  రేప్ చేసిన అనంతరం దుండగులు ఆమె గొంతుపిసికి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తుందన్నారు. మృతదేహం దగ్గర ఒక జత చెప్పులు, అగ్గిపెట్టెలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం మాల్డా మెడికల్ కాలేజీకి పంపించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని ప్రశాంత్ చెప్పారు.

More News

విచారణలో గోప్యత.. ఘటనా స్థలానికి నేడు దిశ నిందితులు!
డాక్టర్ దిశపై అభ్యంతరకర పోస్ట్ లు : స్మైలీ నాని అరెస్ట్
రేప్ కేసు పెట్టిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
లోన్ ఇవ్వలేదని బ్యాంక్ మేనేజర్ పై దాడి