
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మకు కలెక్టరేట్లో కొత్తగూడెం కోర్టుకు చెందిన మహిళా అడ్వకేట్లు శుక్రవారం రాఖీలు కట్టారు. కార్యక్రమంలో అడ్వకేట్లు ఆర్తి మక్కడ్, నకరికంటి ఉమ, యాస మౌనిక, అరుణలత, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.