
జనగామ, వెలుగు: వరంగల్ పర్యటనకు వెళ్తున్న సీఎం కాన్వాయ్లో తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం జనగామ శివారు పెంబర్తి కళాతోరణం వద్ద సీఎం కేసీఆర్కు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ బయలుదేరుతుండగా రన్నింగ్కారు ఎక్కేందుకు ప్రయత్నించిన సీఎం సెక్యూరిటీ సిబ్బందిలోని ఓ మహిళాకానిస్టేబుల్ జారి రోడ్డుపై పడిపోయింది. స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహచర సెక్యూరిటీ స్టాఫ్ఆమెకు సాయమందించగా వెహికల్ఎక్కి వెళ్లిపోయింది.