సైకిల్​పై హాస్పిటల్​కు.. రోడ్డుపైనే మహిళ ప్రసవం

సైకిల్​పై హాస్పిటల్​కు.. రోడ్డుపైనే మహిళ ప్రసవం

షాజహాన్​పూర్(యూపీ): లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో ఉత్తరప్రదేశ్​లో ఓ మహిళ రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెను సైకిల్​పై ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. మార్గమధ్యలో నొప్పులు రావడంతో రోడ్డుపైనే పండంటి ఆడపిల్లను ప్రసవించిందని శనివారం పోలీసులు వెల్లడించారు. ‘‘ఏప్రిల్​ 9వ తేదీ సాయంత్రం రఘునాథ్​పూర్​ గ్రామానికి చెందిన ఓ మహిళను ఆమె భర్త సైకిల్​పై మద్నాపూర్​ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కు సైకిల్​పై తీసుకెళ్లాడు. వారి ఊరి నుంచి కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ జంట ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత సికందర్​పూర్​ గ్రామం వద్దకు చేరుకోగానే మహిళకు నెప్పులు వచ్చాయి. అక్కడికక్కడే ఆమె ఆడ పిల్లను కన్నది”అని సూపరింటెండెండ్​ ఆఫ్​ పోలీస్(రూరల్) అపర్ణా గౌతం చెప్పారు. దగ్గరలో ఉన్న పోలీస్​ రెస్పాన్స్​ వ్యాన్(పీఆర్వీ)కి సమాచారం ఇచ్చి ఆమెను కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కు తరలించినట్టు చెప్పారు. దగ్గరలోని పొలంలో పనిచేసే మహిళ ఆమెకు ప్రసవం చేసిందన్నారు. ఆ మహిళ సాయంతో పీఆర్వీ వెహికల్​ లో ఉన్న మీటు తోమర్..​ తల్లి, బిడ్డలను ఆస్పత్రికి తరలించాడని, ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని గౌతం చెప్పారు.