డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం మహిళల ఆందోళన

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం మహిళల ఆందోళన

కరీంనగర్ జిల్లా తీగల గుట్టపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర ఆందోళన చేపట్టారు మహిళలు. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. నిర్మాణం పూర్తయినా ఇళ్లు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  మెడపై కత్తులు పెట్టుకుని ఆందోళన చేశారు కొందరు మహిళలు. మరికొందరు పురుగు మందు డబ్బాలతో అక్కడికి వచ్చారు. గతంలోనూ ఇదే తరహాలో డబుల్ బెడ్ రూమ్ లను మహిళలు ఆక్రమించడానికి ప్రయత్నించడంతో బయటకు పంపేశారు పోలీసులు. 

ALSO READ: TSPSC: టీఎస్పీఎస్సీ దగ్గర ఉద్రిక్తత