తాండ్రియాల గ్రామంలో బస్సులు ఆపడం లేదని మహిళల ధర్నా

 తాండ్రియాల గ్రామంలో బస్సులు ఆపడం లేదని మహిళల ధర్నా

కోరుట్ల, వెలుగు: ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని కథలాపూర్​ మండం తాండ్రియాల గ్రామంలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. నాలుగు రోజులుగా బస్సులు ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డుపై నిరసన తెలిపారు. గంభీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామం నుంచి వచ్చే బస్సులను ఆపడం లేదని ఆరోపించారు. 

దీనిపై వారం కింద డీఎంకు వినతిపత్రం ఇచ్చామని, అయినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.