
- ఖాళీ బిందెలతో మహిళల నిరసన
సికింద్రాబాద్, వెలుగు : లోప్రెషర్సమస్యతో మంచినీటి సరఫరా సక్రమంగా జరగట్లేదని కొందరు మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో ప్రకాశ్నగర్సెక్షన్వాటర్ వర్క్స్ఆఫీస్వద్ద నిరసనకు దిగారు. నెల రోజులుగా నల్లా సరిగ్గా రావడం లేదని, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
వాటర్ వర్క్స్అధికారులకు విన్నవించినా సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించారు. తక్షణమే స్పందించి లోప్రెషర్సమస్య లేకుండా చేయాలని కోరారు.