ధర్మారం గ్రామంలో బెల్టుషాపుల ఎదుట..పురుగుమందు డబ్బాలతో నిరసన

ధర్మారం గ్రామంలో బెల్టుషాపుల ఎదుట..పురుగుమందు డబ్బాలతో నిరసన

హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు: గ్రామంలో బెల్టుషాపులను నిర్మూలించాలని డిమాండ్​ చేస్తూ మహిళలు పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలో శనివారం బెల్ట్​షాపుల ఎదుట మహిళలు పురుగుల మందు డబ్బాలను చేతిలో పట్టుకుని ఆందోళనకు దిగారు.

అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. షాపులు తొలగించకుంటే హుస్నాబాద్​లోని ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.