సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో కార్మికుడి మృతి

సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో కార్మికుడి మృతి

సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్‌పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ పై కప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం 66 లెవెల్‌లో 41 డీప్ దగ్గర  ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో  శిథిలాల కింద చిక్కుకుని  నవీన్ అనే కార్మికుడు  చనిపోయాడు. మరో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది.