
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ కు అనుబంధంగా మరో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఐక్య కార్మిక, ఇంజినీర్ల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పాల్వంచలోని కేటీపీఎస్ ఇంజినీర్స్ అసోసియేషన్ హాల్ ప్రాంగణంలో నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానికంగా అన్ని రకాల వనరులు ఉన్న నేపథ్యంలో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మరో 2 యూనిట్లను కేటీపీఎస్ కు అనుబంధంగా నిర్మించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ప్లాంట్ సాధన కోసం ఈ నెల 20న మరో సన్నా హక సమావేశం నిర్వహించి కార్యాచరణ చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సీతా రాం రెడ్డి, మంగీలాల్, గిరిధర్, రామకృష్ణ, కోటే శ్వరరావు, రాంబాబు, పుల్లారావు, చారి, బ్రహ్మా జీ, యాస్మిన్, వేణుగో పాల్, అమీన్, మజీద్, రాజేందర్, రవీందర్, సురేశ్, వీర్రాజు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.