తాగిన మత్తులో సూసైడ్ చేసుకున్న కార్మికులు

తాగిన మత్తులో సూసైడ్ చేసుకున్న కార్మికులు

దుండిగల్,వెలుగు: తాగిన మత్తులో కార్మికుడు  సూసైడ్ ​చేసుకుండు. గండిమైసమ్మ పరిధిలోని 60 గజాల కాలనీలో దశరథ్ ( 30), అనుసుజ దంపతులు ఉంటున్నారు.  కార్మికుడిగా పనిచేస్తున్న దశరథ్​ తాగుడుకు బానిసగా మారి పనికి కూడా వెళ్లకుండా పేకాట ఆడుతూ భార్యతో గొడవపడుతుండేవాడు. గురువారం సాయంత్రం  భర్త దశరథ్ కు చెప్పి భార్య జగద్గిరిగుట్టలోని బంధువుల ఇంటికి వెళ్లింది. మత్తులో ఉన్న దశరథ్  ఇంట్లో చీరతో ఉరివేసుకొని చనిపోయాడు. భార్య కంప్లయింట్​తో  దుండిగల్ పోలీసులు  కేసు ఫైల్​ చేశారు.

బిల్డింగ్​పై నుంచి దూకి..

జీడిమెట్ల : బిల్డింగ్​పై నుంచి దూకి ఓ ప్లంబర్​ సూసైడ్ చేసుకుండు. బీదర్​కి చెందిన సుభాష్​ (35), భార్య, ఇద్దరు పిల్లలతో సిటీకి వచ్చి చింతల్ పరిధి ​వెంకటేశ్వరనగర్​లో ఉంటున్నాడు. కుత్బుల్లాపూర్​లోని మోడీ బిల్డర్స్​లో ప్లంబర్​గా చేస్తున్నాడు. తాగుడుకు బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. తాగొద్దని భార్య ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. తను పనిచేసే మోడీ బిల్డర్స్​వద్దకు వెళ్లి బిల్డింగ్​పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కంప్లయింట్​తో జీడిమెట్ల సీఐ బాలరాజు కేసు ఫైల్ ​చేశారు.

For More News..

ఆన్‌లైన్ క్లాసులో న్యూసెన్స్ చేసిన వ్యక్తి

సింగరేణి సీఎండీ ఎక్స్​టెన్షన్​ చెల్లదు

ఫిబ్రవరి 25 నుంచి బీజేపీ ప్రచారం