
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధత్య అని అధికారులు, జడ్జీలు, నాయకులు అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల మొక్కలు నాటారు. ర్యాలీలు నిర్వహించారు. ప్రతిజ్ఞలు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేశారు. కొత్తగూడెం, పాల్వంచలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్, జిల్లా ఐఎఫ్ఎస్ అధికారి జి.కృష్టాగౌడ్, సత్తుపల్లి పట్టణ శివారులోని వైశ్యకాంతల చెరువు వద్ద ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, అశ్వారావుపేటలో పేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మురళి, మధిరలో మధిర సీనియర్ సివిల్ జడ్జి ఎన్.ప్రశాంతి, భద్రాచలంలో ఆర్డీవో దామోదర్, ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్ లో రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏపూరి బిందు ప్రియ, నాల్గవ జూనియర్ సివిల్ జడ్జి, స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్(మొబైల్) బక్కెర నాగలక్ష్మి, పులిగుండాల ప్రాజెక్ట వద్ద పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహిత డాక్టర్ కడవేండి వేణుగోపాల్ పాల్గొన్నారు. - నెట్వర్క్, వెలుగు