పంజాగుట్ట, వెలుగు: వరల్డ్ మూవ్మెంట్ డిజార్డర్స్ డే సందర్భంగా బుధవారం పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవేర్నెస్ వాక్ నిర్వహించారు. మెదడులో న్యూరో ట్రాన్స్మీటర్ వ్యత్యాసం కారణంగా నరాల బలహీనత, వణుకు, కండరాలు బిగుసుకుపోవడం జరుగుతుందని డాక్టర్ శిరీష తెలిపారు.
ఈ వ్యాధితో బాధపడుతున్న 20 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా నిమ్స్లో ట్రీట్ మెంట్ అందించామన్నారు. అవేర్నెస్ వాక్లో నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీన్ రాజశేఖర్, న్యూరో సర్జన్లు, ఫిజియోథెరపీ, నర్సింగ్ ఫ్యాకల్టీ పాల్గొన్నారు.