
ఈ ఏడాది ఆస్కార్కి మనదేశం నుంచి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నామినేట్ అయింది. బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. దీన్ని తీసింది కొత్త డైరెక్టర్లు రింటూ థామస్, సుశ్మిత్ ఘోష్. 2021లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ స్టోరీ మొత్తం ఉత్తరప్రదేశ్కి చెందిన దళిత మహిళలు నడుపుతున్న ‘ఖబర్ లహరియా’ అనే న్యూస్పేపర్ చుట్టూ తిరుగుతుంది. మనదేశంలో దళిత మహిళలు నడుపుతున్న ఏకైక పత్రిక ఇది. దీని చీఫ్రిపోర్టర్ మీరా జాటవ్. ఈ డాక్యుమెంటరీలో మహిళా జర్నలిస్ట్లు, వాళ్లు ఎదుర్కొన్న ఛాలెంజెస్ గురించి చెప్పడంతో పాటు కులవివక్షను ఎదిరించి వాళ్లు చేస్తున్న సాహసం గురించి కూడా ఉంటుంది. ‘ఖబర్ లహరియా’ న్యూస్పేపర్ని 2002లో మొదలుపెట్టారు. వార్తలు సేకరించడం నుంచి తప్పులు సరిచేయడం, ప్రింటింగ్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ వరకు అంతా మహిళలే చూసుకుంటారు. ప్రింటింగ్ హిందీలో ఉంటుంది. చుట్టుపక్కల ఊర్లలో జరిగే లోకల్ ఇష్యూస్తో పాటు డొమెస్టిక్ వయెలెన్స్ గురించి ఎక్కువగా రాసేవాళ్లు. నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ కూడా ఇస్తారు. అది కూడా ఈజీగా అర్థమయ్యే భాషలో. 2012లో ఉత్తరప్రదేశ్, బీహార్లోని 600 గ్రామాల్లో 6 వేల కాపీలు అమ్ముడయ్యాయి. ఈ పేపర్కి దాదాపు 20 వేలమంది రీడర్లు ఉన్నారు. మిగతా పేపర్ల లెక్కనే ‘ఖబర్ లహరియా’ కూడా డిజిటల్ జర్నలిజం వైపు అడుగులు వేసింది. స్మార్ట్ఫోన్లో వీడియోలు తీయడం, రిపోర్టింగ్ చేయడం నేర్చుకున్నారు ఈ మహిళా జర్నలిస్టులు.