ఆస్కార్ బరి​లో రైటింగ్​ విత్​ ఫైర్​

ఆస్కార్ బరి​లో రైటింగ్​ విత్​ ఫైర్​

ఈ ఏడాది ఆస్కార్​కి మనదేశం నుంచి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్​ నామినేట్​ అయింది. బెస్ట్​ డాక్యుమెంటరీ కేటగిరీలో ‘రైటింగ్​ విత్​ ఫైర్​’ ఆస్కార్​ నామినేషన్​ దక్కించుకుంది. దీన్ని తీసింది కొత్త డైరెక్టర్లు రింటూ థామస్​, సుశ్మిత్​ ఘోష్. 2021లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ స్టోరీ మొత్తం ఉత్తరప్రదేశ్​కి చెందిన దళిత మహిళలు నడుపుతున్న ‘ఖబర్​ లహరియా’ అనే న్యూస్​పేపర్​ చుట్టూ తిరుగుతుంది. మనదేశంలో దళిత మహిళలు నడుపుతున్న ఏకైక పత్రిక ఇది. దీని చీఫ్రిపోర్టర్​ మీరా జాటవ్​. ఈ డాక్యుమెంటరీలో మహిళా జర్నలిస్ట్​లు, వాళ్లు ఎదుర్కొన్న ఛాలెంజెస్ గురించి చెప్పడంతో పాటు కులవివక్షను ఎదిరించి వాళ్లు చేస్తున్న సాహసం​ గురించి కూడా ఉంటుంది.  ‘ఖబర్​ లహరియా’ న్యూస్​పేపర్​ని 2002లో మొదలుపెట్టారు. వార్తలు సేకరించడం నుంచి తప్పులు సరిచేయడం, ప్రింటింగ్​ చేయడం, డిస్ట్రిబ్యూషన్​ వరకు అంతా మహిళలే చూసుకుంటారు. ప్రింటింగ్​ హిందీలో ఉంటుంది. చుట్టుపక్కల ఊర్లలో జరిగే లోకల్​ ఇష్యూస్​తో పాటు డొమెస్టిక్​ వయెలెన్స్​ గురించి ఎక్కువగా రాసేవాళ్లు. నేషనల్​, ఇంటర్నేషనల్​ న్యూస్​ కూడా ఇస్తారు. అది కూడా ఈజీగా అర్థమయ్యే భాషలో. 2012లో ఉత్తరప్రదేశ్, బీహార్​లోని 600 గ్రామాల్లో 6 వేల కాపీలు అమ్ముడయ్యాయి. ఈ పేపర్​కి దాదాపు 20 వేలమంది రీడర్లు ఉన్నారు. మిగతా పేపర్ల లెక్కనే ‘ఖబర్​ లహరియా’ కూడా డిజిటల్​ జర్నలిజం వైపు అడుగులు వేసింది. స్మార్ట్​ఫోన్​లో వీడియోలు తీయడం, రిపోర్టింగ్​ చేయడం నేర్చుకున్నారు ఈ మహిళా జర్నలిస్టులు.