షియోమీ, ఒప్పోలకు షాక్.. వెయ్యికోట్ల జరిమానా పడే అవకాశం

షియోమీ, ఒప్పోలకు షాక్.. వెయ్యికోట్ల జరిమానా పడే అవకాశం

పాపులర్ మొబైల్ ఫోన్ బ్రాండ్స్ షియోమీ, ఒప్పోలకు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ షాకిచ్చింది. ఈ రెండు సంస్థలు పన్ను చట్టాలను ఉల్లంఘించాయని IT శాఖ తెలిపింది. వాటిపై వెయ్యి కోట్ల రూపాయల వరకు ఫైన్ పడొచ్చని ప్రకటించింది. ఈ నెల 21న కర్ణాటక, తమిళనాడు, అస్సాం, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్ లలో తనిఖీలు చేశారు IT అధికారులు. 5వేల 500 కోట్ల రూపాయల వరకు అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. దీంతో రెండు కంపెనీలకు వెయ్యి కోట్ల వరకు ఫైన్ పడొచ్చని అంచనా వేస్తున్నారు.