ట్రాక్టర్ బోల్తా..యువకుడి మృతి

ట్రాక్టర్ బోల్తా..యువకుడి మృతి

యాదాద్రి భువనగిరి : ట్రాక్టర్ బోల్తాపడటంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. మండలంలోని వీరవెల్లి నుంచి భువనగిరికి వెళ్లే దారిలో బండసోమారం క్రాసింగ్ దగ్గర ట్రాక్టర్ అదుపుతప్పడంతో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు కేసారం గ్రామానికి చెందిన నవీన్(22)గా గుర్తించిన పోలీసులు..డెడ్ బాడీనీ పోస్ట్ మార్టమ్ కోసం అంబులెన్స్ లో భువనగిరి ఏరియా హస్పిటల్ కు తరలించారు.

వీరవెల్లి శివారులో కంచె దున్ని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు. ప్రమాదంలో కేసు నమోదు చేసుకున్న భువనగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.