‘బడిబాట’ను వెంటనే ప్రారంభించండి :

‘బడిబాట’ను వెంటనే ప్రారంభించండి :
  • స్కూళ్లలో వందశాతం ఎన్రోల్​ చేయాలి
  • ఎట్టిపరిస్థితుల్లో డ్రాపవుట్స్​ ఉండొద్దు
  • రివ్యూ మీటింగ్​లో యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతి

యాదాద్రి, వెలుగు : అడమిక్​ ఇయర్​ ప్రారంభమయ్యే జూన్​లో నిర్వహించే బడిబాటను ఇప్పుడే ప్రారంభించాలని ఆఫీసర్లను యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతి ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా వంద శాతం పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని  సూచించారు. 2023–24 ఎడ్యూకేషన్​ఇయర్​పై సోమవారం కలెక్టరేట్​లో రివ్యూ మీటింగ్​జరిగింది. ఈ సందర్భంగా క్లాస్​ల వారీగా స్డూడెంట్స్​ డిటైల్స్​ను ఎడ్యూకేషన్​ ఆఫీసర్లు వివరించారు. అనంతరం బడిబాటపై కలెక్టర్​ మాట్లాడారు. ఐదేండ్లున్న ప్రతి చిన్నారిని ప్రభుత్వ స్కూల్​లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఉపాధి కోసం వలస వచ్చిన వారిని గుర్తించి, వారి పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో స్టూడెంట్స్​ నమోదు  శాతాన్ని గతం కన్నా పెంచాలని ఆదేశించారు. ఇందుకు స్కూళ్ల​ యాజమాన్య కమిటీలోని పేరెంట్స్​ సాయాన్ని టీచర్లు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో కొందరు పిల్లలకు చదువును మధ్యలోనే ఆపేస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అలాంటి పిల్లలను గుర్తించి వారిని చదువుకునేందుకు ప్రోత్సహించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్స్​ లేకుండా చూడాలని చెప్పారు. స్టూడెండ్స్​ సంఖ్యను పెంచడంతోనే సరిపెట్టకుండా వంద శాతం హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

ప్రతి స్కూల్​లో రీడింగ్ కార్నర్ ఉండేలా చూడాలని చెప్పారు. నెలకు రెండుమార్లు పేరెంట్స్ మీటింగ్, స్వయం సహాయక మహిళా సమాఖ్య సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. టెన్త్​ క్లాస్​ తర్వాత స్టూడెంట్స్​ ప్రైవేట్​ కాలేజీలు కాకుండా ప్రభుత్వ కాలేజీలలో చేరే విధంగా చూడాలని సూచించారు.  మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్ దీపక్ తివారి, డీఈవో నారాయణరెడ్డి, డీపీవో సునంద, బీసీ, ఎస్సీ డెవలప్​మెంట్​  వెల్ఫేర్​ ఆఫీసర్లు​ యాదయ్య, జైపాల్​రెడ్డి, వెల్ఫేర్​ ఆఫీసర్​ కృష్ణవేణి ఉన్నారు.