భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో నరసింహుడి ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. రద్దీకి అనుగుణంగా ఉచిత బస్సులు అందుబాటులో లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు జరిపించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయ ఖజానాకు ఆదివారం రూ.50,55,460 ఇన్ కం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.18,38,400, వీఐపీ టికెట్ల ద్వారా రూ.13.65 లక్షలు, కొండపైకి వెహికల్స్ ప్రవేశం ద్వారా రూ.7 లక్షలు, సత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2,13,600, మెయిన్ బుకింగ్ ద్వారా రూ.2,13,250 ఇన్ కం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.